హార్దిక్ నోట.. లంక జాతీయ గీతం
ABN , First Publish Date - 2021-07-28T09:31:27+05:30 IST
క్రికెట్ మ్యాచ్లకు ముందు ఆయా జట్లకు చెందిన జాతీయ గీతాలను పాడడం సంప్రదాయం. శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు వరుసలో...
కొలంబో: క్రికెట్ మ్యాచ్లకు ముందు ఆయా జట్లకు చెందిన జాతీయ గీతాలను పాడడం సంప్రదాయం. శ్రీలంక, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు వరుసలో నిలబడి తమతమ జాతీయ గీతాలను ఆలపించారు. అయితే, టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. లంక జాతీయ గీతాన్ని పాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. క్రికెట్కు పాండ్యా నిజమైన అంబాసిడర్ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తున్నారు. తన చర్య ద్వారా బలమైన సందేశాన్ని ఇచ్చాడని కొనియాడుతున్నారు.