పాండ్యా సోదరుల ఇంట తీవ్ర విషాదం.. ఊహించని విధంగా..
ABN , First Publish Date - 2021-01-16T19:53:32+05:30 IST
టీమిండియా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన..
ముంబై: టీమిండియా ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయనను వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. తండ్రి మరణించిన వార్త తెలియగానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్ పాండ్యా వెంటనే ఇంటికి చేరుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీలో ఆడాడు. ఆ తరువాత భారత్ తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ ఇంగ్లండ్తో జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్కు శిక్షణ తీసుకుంటున్నాడు.
పాండ్యా సోదరుల ఇంటి జరిగిన విషాదం గురించి తెలుసుకోగానే.. టీమిండియా క్రికెటర్లు ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తదితర క్రికెటర్లు కూడా పాండ్యా సోదరుల తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.