వేధింపులే వైసీపీ లక్ష్యం : గుండుమల

ABN , First Publish Date - 2022-06-26T05:49:01+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మండిపడ్డారు.

వేధింపులే వైసీపీ లక్ష్యం : గుండుమల
విలేకరులతో మాట్లాడుతున్న గుండుమల

మడకశిర టౌన, జూన 25 : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మండిపడ్డారు.  శనివారం స్థాని క పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ..  రొళ్ళ మండలం హునిసే కుంట గ్రామంలో టీడీపీ కార్యకర్త బీసీ వర్గానికి చెందిన రత్నమ్మకు సంబంధించిన చిల్లర దుకాణం కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చినా ఎమ్మెల్యే ప్రొద్బలంతో అధికారులు ఏక పక్షంగా దాన్ని కూల్చివేశారని, దీంతో దాదా పు రూ. 10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని అన్నారు. మడకశిర ఎమ్మెల్యే పతనం హునిసేకుంట గ్రామం నుంచే మొదలు కబోతుందన్నారు.కష్టంలో ఉన్న టీడీపీ కార్యక ర్తలకు అండగా ఉంటామని అధైర్య పడవద్దని అన్నారు. ఈనెల 27న రత్నమ్మకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ చలో రొళ్ళ కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన కార్యకర్తకు  న్యాయం జరిగేవరకు అక్కడే పోరాటం చేస్తా మన్నారు. చలో రొళ్ళ కార్యక్రమంలో నాయ కులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో రొళ్ళ కన్వీనర్‌ దాసిరెడ్డి, నాయ కులు గురుమూర్తి, సిద్దగంగప్ప, బాలక్రిష్ణ, యువత అధ్యక్షులు నాగరా జు,నాగేంద్ర, దాసప్ప, ఉగ్రేగౌడు, రంగనాథ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-26T05:49:01+05:30 IST