ఫేస్బుక్లో బ్యూటీషియన్కు వేధింపులు
ABN , First Publish Date - 2021-04-30T16:38:25+05:30 IST
ఫేస్బుక్ ఖాతాలో ఓ బ్యూటీషియన్ను వేధింపులకు గురిచేస్తున్న
హైదరాబాద్/బంజారాహిల్స్ : ఫేస్బుక్ ఖాతాలో ఓ బ్యూటీషియన్ను వేధింపులకు గురిచేస్తున్న వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నందినగర్కు చెందిన గడ్డి రమాదేవి బ్యూటీషియన్. ఫేస్బుక్ ద్వారా బ్యూటీటిప్లు ఇస్తుంటుంది. కొద్దికాలం క్రితం మల్లికార్జున్ అనే వ్యక్తి ఆమెకు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. దుర్భాషలాడుతూ అసభ్యమైన ఫొటోలు పోస్టింగ్ చేయసాగాడు. కొద్దిరోజుల తరువాత కెరటాల రాజేశ్వరి, తాళ్ల శివరెడ్డి, నేహారెడ్డిలు సైతం ఆమెకు అసభ్య మెసేజ్లు పెట్టడంతోపాటు అభ్యంతరకర ఫొటోలు, వీడియోలుపెడుతూ వేధింపులకు గురిచేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.