అదనపు కట్నం కోసం వేధింపులు

ABN , First Publish Date - 2021-04-11T05:10:03+05:30 IST

అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, ఆడపడుచుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

అదనపు కట్నం కోసం వేధింపులు

కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 10: అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, ఆడపడుచుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కోవెలకుంట్ల పట్టణంలోని గడ్డవీధికి చెందిన మొగలి కళ్యాణి అనే యువతిని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మెట్రి గ్రామానికి చెందిన శివన్న కుమారుడు అరవింద్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.  ఇటీవల  అదనపు  కట్నం తేవాలని భర్త అరవింద్‌కుమార్‌, అతని అమ్మ శాంతమ్మ, అక్క హైమావతి, చెల్లి సావిత్రి  కలిసి తరచూ   తనను మానసికంగా హింసిస్తు న్నారని  కళ్యాణి కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిం దన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-04-11T05:10:03+05:30 IST