బాలుడికి చిత్రహింసలు

ABN , First Publish Date - 2021-04-17T06:41:51+05:30 IST

కన్నతండ్రి చనిపోయాడు. కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన కన్నతల్లి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. పెద్దనాన్న

బాలుడికి చిత్రహింసలు
తీవ్ర గాయాలతో నాగేంద్ర

 వాతలు పెట్టి నరకం చూపించిన పెద్దనాన్న రాజు

జీడిమెట్ల, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): కన్నతండ్రి చనిపోయాడు. కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన కన్నతల్లి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది. పెద్దనాన్న తమ్ముడి కొడుకును దగ్గరికి తీసుకుని కాపాడతాడనుకుంటే మూడు సంవత్సరాలుగా చింత్రహింసలు పెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే... చింతల్‌ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సాయికుమార్‌, శ్రావణి భార్యాభర్తలు. మూడు సంవత్సరాల క్రితం సాయికుమార్‌ మరణించాడు. వీరికి ఇద్దరు కుమారులు. తల్లి చిన్న కొడుకు నాగేంద్ర(6)ను ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న బాలుడి పెద్దనాన్న రాజు వద్ద వదిలేసి, పెద్దకొడుకుతో కలిసి నిజామాబాద్‌లో ఉంటోంది. మొదట్లో బాగానే చూసిన రాజు కొంతకాలంగా బాలుడిని కొట్టడం, వంటిపై వాతలు పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ విషయం గమనించిన స్థానికులు గురువారం మేడ్చల్‌ జిల్లా చైల్డ్‌వెల్ఫేర్‌ అధికార్డులకు  సమాచారం అందించారు. ఎల్‌సీపీఓ ఏ.సుజాత జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. ఆటోడ్రైవర్‌ రాజు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-04-17T06:41:51+05:30 IST