జైళ్లల్లోని ఖైదీలకు రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2020-04-03T07:53:10+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాపించకుండా జైళ్లలో ఉన్న దోషులు, అండర్‌ ట్రయల్‌ ఖైదీల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

జైళ్లల్లోని ఖైదీలకు రక్షణ కల్పించాలి

హైకోర్టులో హరగోపాల్‌ పిల్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వ్యాపించకుండా జైళ్లలో ఉన్న దోషులు, అండర్‌ ట్రయల్‌ ఖైదీల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున విశ్రాంత ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. జైళ్లల్లో ఉన్న దోషులు, అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు కరోనా వైరస్‌ సోకకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం అండర్‌ ట్రయల్‌ రివ్యూ కమిటీ వేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసిందని  పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చి వారం గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.  

Updated Date - 2020-04-03T07:53:10+05:30 IST