ఆజాది కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-08T02:54:09+05:30 IST
బోగోలు మండలం విశ్వనాథరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో నాసరరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరిగింది.
బిట్రగుంట, ఆగస్టు 7: బోగోలు మండలం విశ్వనాథరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో నాసరరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరిగింది. 59 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో ఎస్సీసీ క్యాడెట్లు, బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ఎస్ఆర్కే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు బోగోలు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. బోగోలులో తహసీల్దారు లక్ష్మీనారాయణ, సర్పంచి మంజుల, జడ్పీటీసీ కీర్తన, మండల ఉపాధ్యక్షురాలు ఎం.పద్మ, ఎంపీటీసీ సుందర్రాజ్, ఎంఈవో జయింత్బాబు, ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్ ఠాగూర్, చెంచులక్ష్మి విద్యార్థులతో కలసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ ఉమెన్స్ అసోసియేషన్, రూరల్ డెవల్పమెంట్ వ్యవస్థాపకురాలు జీబీ శైలజ తదితరులు పాల్గొన్నారు. అలాగే బోగోలు మండలం రైల్వే ఫుట్బాల్ క్రీడామైదానంలో బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకసాని.శ్రీనివాసులు యాదవ్ అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ సభ్యులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట రైల్వే స్టేషన్ ఎస్ఎస్ ఎల్సీ.మీనా కుమార్, కార్యదర్శి జీవన్కుమార్, మాజీ సైనికుడు వైవీపీరెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.