ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-08T06:17:48+05:30 IST

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
ఆప్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు

గవర్నర్‌పేట, ఆగస్టు 7: చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ తలశిల రఘురాం అన్నారు. రామ మందిరం రోడ్డులోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆదివారం జాతీయ చేనే త దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేనేత రంగంపై అవ గాహన కల్పించి కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్ల డించారు. ఎమ్మెల్యే వెలంపల్లి మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఆప్కో కీలక పాత్ర పోషి స్తోందన్నారు. వేడుకల్లో ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, చేనేత జౌళిశాఖ సంయుక్త సంచాలకులు ఎం.నాగేశ్వరరావు ప్రసంగించారు.



Updated Date - 2022-08-08T06:17:48+05:30 IST