ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి

ABN , First Publish Date - 2022-09-29T03:33:34+05:30 IST

విప్లవ కెరటం భగత్‌సింగ్‌ జయంతిని బీసీ యువజనసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. నాయకులు నాగరాజు, ప్రశాంత్‌, తరుణ్‌, ప్రణీత్‌, రాజశేఖర్‌, రాజేష్‌, సాగర్‌ పాల్గొన్నారు.

ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి
భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న బీసీ సంఘం నాయకులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28: విప్లవ కెరటం భగత్‌సింగ్‌ జయంతిని బీసీ యువజనసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. నాయకులు నాగరాజు, ప్రశాంత్‌, తరుణ్‌, ప్రణీత్‌, రాజశేఖర్‌, రాజేష్‌, సాగర్‌ పాల్గొన్నారు.

కెరమెరి: మండలంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు రాంచందర్‌, మారుతి, సాయి, భీంరావు,సాయికుమార్‌ పాల్గొన్నారు.  

చింతలమానేపల్లి: మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ నానయ్య భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. నాయకులు వెంకన్న, మారుతి, పాపయ్య, ఆకాష్‌, లహన్సు, జగదీష్‌, తివారీ పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సై రవి కుమార్‌, ప్రిన్సిపాల్‌ కల్యాణి, ఏబీవీపీ నాయకులు అరుణ్‌కుమార్‌, అంజలి, నవీన్‌, ప్రశాంత్‌, విష్ణు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T03:33:34+05:30 IST