పెళ్లయ్యాక భర్తతో అత్తారింటికెళ్తున్న వధువు.. తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారుకు ఆవు అడ్డు రావడంతో..

ABN , First Publish Date - 2022-01-24T20:35:55+05:30 IST

బంధుమిత్రుల సమక్షంలో ఎంతో సంతోషంగా జరిగిన వివాహ వేడుక విషాదంగా మారింది

పెళ్లయ్యాక భర్తతో అత్తారింటికెళ్తున్న వధువు.. తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న కారుకు ఆవు అడ్డు రావడంతో..

బంధుమిత్రుల సమక్షంలో ఎంతో సంతోషంగా జరిగిన వివాహ వేడుక విషాదంగా మారింది. పెళ్లి సందడితో కళకళలాడిన ఇంట్లో స్మశాన నిశబ్దం అలముకుంది. పెళ్లి జరిగిన కాసేపటికే జరిగిన ప్రమాదంలో వధువు సోదరుడి మరణం తీవ్ర విషాదం నింపింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన జరిగింది. బార్మర్ జిల్లాలోని సిరోహి జరియావాల గ్రామంలో శనివారం రాత్రి ప్రహ్లాదరామ్ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. 


వివాహం తర్వాత భర్తతో పాటు నూతన వధువు అత్తింటికి బయల్దేరింది. ఆ కారులో ఆమె సోదరుడు రణరామ్‌ కూడా ఉన్నాడు. రాత్రి సమయంలో వేగంగా కారును నడుపుతున్న డ్రైవర్.. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆవును తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును గుద్దేశాడు. ఈ ఘటనలో రణరామ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నూతన వధూవరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివాహం జరిగిన కొద్ది సేపటికే ఘోర ప్రమాదం సంభవించడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2022-01-24T20:35:55+05:30 IST