జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వివాదం

ABN , First Publish Date - 2020-02-17T01:58:52+05:30 IST

సీఎం జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆదేశాలతో ఎస్వీ మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది.

జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వివాదం

కర్నూలు: సీఎం జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆదేశాలతో ఎస్వీ మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపుపై ఎస్వీ మోహన్‌రెడ్డి వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కూడళ్లలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఇరువర్గాలు కడుతున్నారు. హఫీజ్‌ఖాన్‌, మోహన్‌రెడ్డి మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ఎన్నికల ముందు తర్వాతా తనను ఎస్వీ మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారని  హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. మోహన్ రెడ్డి, తన కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. 


Updated Date - 2020-02-17T01:58:52+05:30 IST