Hyderabad: Agnipath మంటలు చల్లారలేదు: VH

ABN , First Publish Date - 2022-06-20T20:41:47+05:30 IST

అగ్నిపథ్‌ మంటలు ఇంకా చల్లారలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు.

Hyderabad: Agnipath మంటలు చల్లారలేదు: VH

Hyderabad: అగ్నిపథ్‌ (Agnipath ) మంటలు ఇంకా చల్లారలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు (Hanumantrao) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆర్మీ (Army) అధికారుల మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లుందన్నారు. ప్రధాని మోదీ (Modi).. కార్పొరేట్ కంపెనీల చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. ఆఖరికి సైన్యాన్ని కూడా మోదీ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సైనికుల పట్ల అవమానకరంగా మాట్లాడిన.. బీజేపీ నేత కైలాస్‌ విజయ్‌ (Kailas Vijay)పై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు దేశంలో అల్లకల్లోం సృష్టిస్తున్నారని, పదేళ్లలో ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. రెండు కోట్లు ఉద్యోగాలు, బ్లాక్ మనీ ఏమైందని వీహెచ్ నిలదీశారు. 

Updated Date - 2022-06-20T20:41:47+05:30 IST