రెండో రోజు కొనసాగుతున్న వీహెచ్ ఆమరణ దీక్ష

ABN , First Publish Date - 2021-04-13T18:36:54+05:30 IST

వి.హనుమంతరావు చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు మంగళవారం కొనసాగుతోంది.

రెండో రోజు కొనసాగుతున్న వీహెచ్ ఆమరణ దీక్ష

హైదరాబాద్: అంబేద్కర్ విగ్రహం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు మంగళవారం కొనసాగుతోంది. తన ప్రాణం పోయినా పరవాలేదని.. అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రచారం చేయకుండా ఆమెపై నిషేధం విధించడం దుర్మార్గమన్నారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ఇలా చూడలేదని అన్నారు. భేటి బచావ్ అనే బీజేపీ.. ఓ మహిళా నేతపై వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఫలించిందని, తవ్వకాలు జరపమని చెప్పడం ప్రజల విజయమని వీహెచ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-04-13T18:36:54+05:30 IST