కసాపురం ఆలయంలో హనుమద్‌ యాగం

ABN , First Publish Date - 2022-05-22T06:50:22+05:30 IST

హనుమజ్జయంతిని పురస్కరించుని కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమద్‌ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కసాపురం ఆలయంలో హనుమద్‌ యాగం

గుంతకల్లు, మే 21:  హనుమజ్జయంతిని పురస్కరించుని కసాపురంలోని  నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమద్‌ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి ఆలయంలో గణ పతి పూజ, పుణ్యాహవాచనం, షోడశ నాందీ మాతృకా పూజ, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, గోపూజ, యాగ కార్యక్ర మాలను నిర్వహించారు. వేద పండితులు సుందరకాండ పారాయణం, మన్యుశూక్త పారాణాలు, మండప దేవతారాధన గావించారు. నెట్టికంటి ఆంజనేయుడి మూల విరాట్టుకు పుష్పా లంకరణలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు తులసీ లక్షార్చన, వాస్తు యోగిని, నవగ్రహ సర్వత్రోభద్ర బం డల, ప్రధాన దేవత అవాహనలు, అగ్ని ప్రతిష్టాపన, అంకురా ర్పణ కార్యక్రమాలను చేశారు. రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహా లను వెండి రథంపై ఆశీనులను గావించి ప్రాకారోత్సవాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, ఏఈఓ ధనుంజయ, సూపరింటెండెంట్లు మధుసూదన రెడ్డి, వెంకటేశ్వర్లు, ట్రస్టుబోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:50:22+05:30 IST