భక్తిశ్రద్ధలతో హనుమాన్ పల్లకీ సేవ
ABN , First Publish Date - 2022-08-07T06:03:42+05:30 IST
భక్తిశ్రద్ధలతో హనుమాన్ పల్లకీ సేవ
షాద్నగర్ అర్బన్, ఆగస్టు 6: షాద్నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ పులిమామిడి లతశ్రీశ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు భజన, భక్తి పాటలను పాడుతూ పల్లకీ సేవను నిర్వహించారు. పల్లకీ సేవ అనంతరం బాలానగర్ అనంతరెడ్డి, సంగెం గోపాల్రెడ్డి, మధన్ల సంయుక్త సహకారంతో భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లి శ్రీవర్ధన్రెడ్డి, జి.వసంతరావు, జి.రమేష్, కృష్ణయ్చ, బాల్రాజ్, కృష్ణచారి, అంజనేయులుగౌడ్, ఆలయ పూజారులు రఘుపతిరావు, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.