శింగరకొండలో హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-24T05:40:54+05:30 IST
శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హను మజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
అద్దంకి, మే 23: శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హను మజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రదక్షణ , ఆలయ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శ్రీలక్ష్మీగణపతి హోమం, నవగ్రహసహిత మన్యుసూక్త హోమం, వాస్తు మండపా రాధన నిర్వహించారు. స్వామి వారికి సహస్రనామ పూజ నిర్వహించారు. సా యంత్రం మన్యుసూక్త హోమం, సహస్ర కదళీఫల పూజ నిర్వహించారు. చైర్మ న్ కోట శ్రీనివాసకుమార్, ఈవో రఘునాధరెడ్డి, ఉభయదాతలు బల్లికురవ మం డలం కొండాయపాలెం కు చెందిన ధూళిపాళ్ళ రామగోవిందు, శివకుమారి దం పతులు, భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్షా భక్తు లు మంగళవారం సాయం త్రంకు శింగరకొండ చేరుకోనున్నారు. బుధవారం హనుమజ్జయంతి నిర్వహించనున్నారు.