సోను సాయాన్ని కోరుతూ హనుమ ట్వీట్.. స్పందించిన గౌతమ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-05-17T21:27:12+05:30 IST
కోవిడ్ బాధితుల సేవలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తనదైన పాత్ర పోషిస్తున్నారు. ట్విటర్ ద్వారా అవసరమైన సమాచారం అందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కోవిడ్ బాధితుల సేవలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తనదైన పాత్ర పోషిస్తున్నారు. ట్విటర్ ద్వారా అవసరమైన సమాచారం అందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన చేసిన ట్వీట్కు రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్టణానికి చెందిన ఎన్. వరలక్ష్మి అనే పేషంట్ కంటి సమస్యతో బాధపడుతోంది. కోవిడ్ పేషంట్ అయిన ఆమెను నగరంలోని ఎన్ఆఐ ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్ అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ విషయం హనుమ విహారికి తెలియడంతో.. ఆయన ట్వీట్ చేస్తూ... ఈమెకు సాయంత్రం నాలుగులోపు వైద్యం అందకపోతే చూపు కోల్పోతుందని ... సాయం చేయాలంటూ సోనుసూద్ను ట్యాగ్ చేశాడు.
ఈ ట్వీట్కు రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి స్పందిస్తూ... తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని కోరారు. వెంటనే స్పందించిన హనుమ... ఆ వివరాలను ఆయనకు అందించారు.