హనుమకొండ చోరీ కేసులో కనిపించని పురోగతి
ABN , First Publish Date - 2021-11-17T14:29:30+05:30 IST
హనుమకొండ నడిబొడ్డున భారీ చోరీ జరిగి మూడు రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది.
హనుమకొండ: హనుమకొండ నడిబొడ్డున భారీ చోరీ జరిగి మూడు రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించని పరిస్థితి నెలకొంది. హనుమకొండ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దగ్గర కారు అద్దాలు పగులగొట్టిన దుండగులు 25 లక్షలు ఎత్తుకెళ్లారు. నగరంలో సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. చోరీ జరిగిన రోజు ఒక నిందితుడు డబ్బు తీసుకుని వెళ్తున్నట్టు ఓ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో కొందరు పోలీసు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.