హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసన
ABN , First Publish Date - 2021-10-11T17:04:52+05:30 IST
హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
హనుమకొండ: హన్మకొండ కలెక్టరేట్ ఎక్కి ఇద్దరు మహిళల నిరసనకు దిగారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. తమ భూసమస్య పరిష్కరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. హనుమకొండ అశోక కాలనీలోని తమ ఇంటిని వేరే వ్యక్తులు స్వాధీనం చేసుకునేందుకు చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు పీట్ల కావేరి, తిరుపతమ్మ కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని ఇద్దరు మహిళలకు నచ్చజెప్పి, వారికి హామీ ఇచ్చి కిందకు దిగారు.