మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో దగా చేస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-16T17:58:34+05:30 IST

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో దగా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో దగా చేస్తున్న ముఠా అరెస్ట్

హనుమకొండ: మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో దగా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్వల్ప పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయంటూ దుండగులు మోసానికి పాల్పడ్డారు. దాదాపు 38 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే వివిధ వ్యక్తుల నుంచి 1.67 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు  వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 19 మంది బాధితులను గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వరంగల్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా... మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.10.5 లక్షల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-06-16T17:58:34+05:30 IST