Hanmakondaలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-28T15:58:33+05:30 IST
జిల్లాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ నగర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హనుమకొండ: జిల్లాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ నగర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు బెడ్రూం ఇళ్లు కేటాయించాలంటూ మంగళవారం ఉదయం పేదలు ధర్నాకు దిగారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఐదేళ్లు గడిచినా ఇళ్లను పంపిణీ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు పేదలు యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.