చేనేత కార్మికులను ఆదుకోవాలి: దాసు
ABN , First Publish Date - 2020-03-29T11:11:00+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో చేనేత, జౌళి పరిశ్రమ కూడా కుదేలయ్యిందని, ఈ రంగంపై ఆధారపడిన వారు ఉపాధి లేక అల్లాడుతున్నారని నేతన్నల ఐక్య
హైదరాబాద్, మార్చి28 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో చేనేత, జౌళి పరిశ్రమ కూడా కుదేలయ్యిందని, ఈ రంగంపై ఆధారపడిన వారు ఉపాధి లేక అల్లాడుతున్నారని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను అదుకుంటున్న మాదిరిగానే... చేనేత కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలోని చేనేతలను ప్రభుత్వం ఆదుకోవాలని దాసు సురేశ్ కోరారు.