చేనేత కార్మికులకు అండగా నిలవాలి

ABN , First Publish Date - 2021-03-02T05:21:33+05:30 IST

ప్రజలంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేత కార్మికులను ప్రోత్సహించాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

చేనేత కార్మికులకు అండగా నిలవాలి
వస్త్ర ప్రదర్శనలో చీర నాణ్యతను పరిశీలిస్తున్న జేసీ హరేందిర ప్రసాద్‌

చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభోత్సవంలో జేసీ హరేందిరప్రసాద్‌


నెల్లూరు(వ్యవసాయం), మార్చి 1 : ప్రజలంతా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేత కార్మికులను ప్రోత్సహించాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ పిలుపునిచ్చారు. నెల్లూరులోని మహేశ్వరి పరమేశ్వరి కల్యాణ మండపంలో సోమవారం చేనేత-జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. చేతితో రూపొందించిన వస్ర్తాలు చేనేత కార్మికుల ప్రతిభకు నిదర్శనమన్నారు. చేనేత జౌళి శాఖ ఏడీ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఈనెల 14వతేదీ వరకు ఉంటుందని చెప్పారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌కి చెందిన 50 చేనేత సంఘాలు ఈప్రదర్శనలో పాల్గొంటున్నాయన్నారు.

Updated Date - 2021-03-02T05:21:33+05:30 IST