దళిత దివ్యాంగ మహిళ మృతి
ABN , First Publish Date - 2022-07-06T06:42:23+05:30 IST
కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరులో మంగళవారం దళిత మూగ, చెవిటి మహిళను హత్య చేశారు. గ్రామానికి చెం దిన గుండపు రాజేశ్వరి (44) ఎస్సీ కాలనీలో నివసిస్తోంది.
ఆలమూరు, జూలై 5: కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరులో మంగళవారం దళిత మూగ, చెవిటి మహిళను హత్య చేశారు. గ్రామానికి చెం దిన గుండపు రాజేశ్వరి (44) ఎస్సీ కాలనీలో నివసిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చర్చికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆమె ఉదయం ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు వెళ్లి తలుపులు తీయగా మంచంపై మృతి చెంది ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఆలమూరు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఎస్.శివప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం అందించగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్ సంఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్కు సమాచారం అందించారు. రామచంద్రపురం, అమలాపురం జిల్లా డాగ్ స్క్వాడ్ పరిసరాలను పరిశీలించింది. డాగ్ సంఘటనా స్థలం నుంచి మండపేట-ఆలమూరు రోడ్డు వరకు వచ్చింది. క్లూస్ టీమ్ ఇచ్చిన సమాచారం, స్థానికులు, బంధువులు ఇచ్చిన వివరాల మేరకు ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.