‘హామీలను తుంగలో తొక్కారు’
ABN , First Publish Date - 2022-08-10T06:55:34+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి దానిని తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా విమర్శించారు.
మామిడికుదురు, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి దానిని తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా విమర్శించారు. యువసంఘర్షణ యాత్ర మంగళవారం మామిడికుదురులో జరిగింది. ఈ యాత్రలో వేమా పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.