పరిహారంపై భూ నిర్వాసితుల అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-19T08:14:22+05:30 IST

ముంపునకు గురైన తమకు.. మల్లన్నసాగర్‌ నిర్వాసితులతో సమంగా పరిహారం ఇవ్వాలంటూ మూడు రోజుల నుంచి వీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల నిర్వాసితులు గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ చౌర స్తా వద్దరోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయుంచారు.

పరిహారంపై భూ నిర్వాసితుల అర్ధనగ్న ప్రదర్శన

రాస్తారోకోలో రాజగోపాల్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి

కేసీఆర్‌కు నిర్వాసితుల ఉసురు: కోదండరాం


మర్రిగూడ, ఆగస్టు 18: ముంపునకు గురైన తమకు.. మల్లన్నసాగర్‌ నిర్వాసితులతో సమంగా పరిహారం ఇవ్వాలంటూ మూడు రోజుల నుంచి వీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్ల నిర్వాసితులు గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ చౌర స్తా వద్దరోడ్డుపై అర్ధనగ్నంగా బైఠాయుంచారు. కాగా, వీరి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండవిశ్వేశ్వర్‌రెడ్డి అనంతరంరాస్తారోకోకు మద్దతు గా నిలిచారు. కేసీఆర్‌ భూనిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారని.. ఏడున్నరేళ్లుగా పరిహారం రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ సభకు ముఖ్యమంత్రి వస్తున్నందున నారాయణపురం రోడ్డుపై బైఠాయించి సమస్యలు పరిష్కరించేంత వరకు ధర్నా చేద్దామని రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, నిర్వాసితుల ఉసురు తగిలి సీఎం కేసీఆర్‌ కొట్టుకుపోతారని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కో దండరాం అన్నారు. నిర్వాసితుల ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. 

Updated Date - 2022-08-19T08:14:22+05:30 IST