మనలో సగం మందికి చేతులు కడిగే అలవాటే లేదు

ABN , First Publish Date - 2020-03-26T06:21:46+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరి నోట ‘శుచీ-శుభ్రత’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎంత శుభ్రంగా ఉంటే రోగాలకు మనం అంత దూరంగా ఉంటాం. అయితే యూకేలోని

మనలో సగం మందికి  చేతులు కడిగే అలవాటే లేదు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరి నోట ‘శుచీ-శుభ్రత’ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఎంత శుభ్రంగా ఉంటే రోగాలకు మనం అంత దూరంగా ఉంటాం. అయితే యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌.... ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.  ఈ సర్వే ప్రకారం భారత్‌లో 50 శాతం మంది ప్రజలు మాత్రమే వెంట వెంటనే చేతులను శుభ్రం చేసుకునే అలవాటును కలిగి ఉన్నారు. అదే  చైనాలో అయితే 77 శాతం, దక్షిణ కొరియాలో 61 శాతం, నెదర్లాండ్స్‌లో 50 శాతం మంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.


సౌది అరేబియా, బోస్నియా, ఆల్జీరియా, లెబనాన్‌, పపువా న్యూ గినీయా దేశాల్లో చేతులు శుభ్రం చేసుకునే సంప్రదాయం అధికంగా ఉంది.  చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోని దేశాల  జాబితాలో థాయ్‌లాండ్‌, కెన్యా, ఇటలీ, మలేసియా, హాంగ్‌కాంగ్‌  తరవాత భారత్‌ నిలిచింది. కరోనా వ్యాప్తి విస్తరిస్తున్న ఈ సమయంలో ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-26T06:21:46+05:30 IST