టీకా తీసుకుంటేనే హజ్ యాత్రకు: కేంద్రం
ABN , First Publish Date - 2021-10-23T08:13:52+05:30 IST
కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఈసారి హజ్ యాత్రకు ఎంపిక చేయనున్నారు. ‘హజ్ - 2022’పై శుక్రవారమిక్కడ జరిగిన..
న్యూఢిల్లీ, అక్టోబరు 22: కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఈసారి హజ్ యాత్రకు ఎంపిక చేయనున్నారు. ‘హజ్ - 2022’పై శుక్రవారమిక్కడ జరిగిన సమీక్ష సమావేశంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వివరాలను వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల మొదటివారంలో ప్రారంభం అవుతుందన్నారు. ఈసారి హజ్ యాత్రికులకు డిజిటల్ హెల్త్ కార్డు, ‘ఈ-మసీహ’ వైద్య సౌకర్యం అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.