హజీరాబీది హత్యనే..

ABN , First Publish Date - 2021-01-24T05:55:14+05:30 IST

గత ఏడాది ఆగస్టు 17వ తేదీన రాత్రి మృతి చెందిన హజీరాబీ(20)ది హత్యనే అని కోడుమూరు సీఐ శ్రీధర్‌, గోనెగండ్ల ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు.

హజీరాబీది హత్యనే..

- శవపరీక్షతో నిరూపణ: సీఐ


గోనెగండ్ల, జనవరి 23: గత ఏడాది ఆగస్టు 17వ తేదీన రాత్రి  మృతి చెందిన హజీరాబీ(20)ది హత్యనే అని కోడుమూరు సీఐ శ్రీధర్‌, గోనెగండ్ల ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి శనివారం తెలిపారు. దీంతో కేసును హత్యకేసుగా మర్చినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో నోరు, ముక్కు మూసి అదిమిపట్టి, గొంతు నిలిమి చంపినట్లు ఉందన్నారు. మృతురాలి సోదరుడు దూద్‌వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 18వ తేదీన నాటి కర్నూలు డీఎస్పీ వెంకటరామయ్య, ట్రైనీ డీఎస్పీ భవ్యకిషోర్‌, కోడుమూరు సీఐ పార్థసారఽథిరెడ్డి, గోనెగండ్ల ఎస్‌ఐ హనుమంతరెడ్డి విచారణ చేశారు. నిందితులను తప్పక పట్టుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-01-24T05:55:14+05:30 IST