హజ్‌ యాత్రికులు 31లోగా డబ్బు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-05-28T08:41:23+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్రికులు ఈ నెల 31లోగా ప్రయాణానికి సంబంధించిన మొత్తం డబ్బు చెల్లించాలని హజ్‌ కమిటీ ఆఫ్‌

హజ్‌ యాత్రికులు 31లోగా డబ్బు చెల్లించాలి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్రికులు ఈ నెల 31లోగా ప్రయాణానికి సంబంధించిన మొత్తం డబ్బు చెల్లించాలని హజ్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించినట్లు తెలంగాణ రాష్ట్ర హజ్‌ కమిటీ తెలిపింది. మొదటి విడతలో చెల్లించిన నగదు పోగా మిగిలిన మొత్తాన్ని ప్రయాణికులు చెల్లించాలని తెలంగాణ హజ్‌ కమిటీ ఈవో షఫిఉల్లా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హజ్‌ యాత్రికుల కోసం హజ్‌ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ క్యాం పులు నిర్వహిస్తోందని, వీటికి తప్పకుండా హాజరు కావాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 040-23298793 నంబరును సంప్రదించాలన్నారు.


Updated Date - 2022-05-28T08:41:23+05:30 IST