శిరోజామృతం
ABN , First Publish Date - 2021-12-02T06:39:56+05:30 IST
వెంట్రుకలు పెరగడానికి ఖరీదైన సీరం వాడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చులోనే పోషకభరిత శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు.....
వెంట్రుకలు పెరగడానికి ఖరీదైన సీరం వాడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చులోనే పోషకభరిత శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే....
వీటిని సిద్ధం చేసుకోవాలి
ఆముదం - పావు కప్పు
కొబ్బరినూనె - పావు కప్పు
మెంతులు - ఒక టేబుల్స్పూను
నల్ల జీలకర్ర - ఒక టేబుల్స్పూను
రోజ్మేరీ ఆయిల్ - రెండు చుక్కలు
పెప్పర్మింట్ ఆయిల్ - రెండు చుక్కలు
తయారీ ఇలా
నల్ల జీలకర్ర, మెంతులను కొబ్బరినూనెలో వేసి, చిన్న మంట మీద 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నూనెను వడగట్టి, ఆముదం కలపాలి.
రోజ్మేరీ, పెప్పర్మింట్ నూనెలను కూడా జోడించాలి.
ఈ నూనెతో 10 నిమిషాల పాటు కుదుళ్లను సున్నితంగా మర్దన చేయాలి.
అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే, జుట్టు రాలడం తగ్గి, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.