మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన సుధాకర్ తల్లి
ABN , First Publish Date - 2020-06-05T00:27:08+05:30 IST
డా.సుధాకర్ కేసులో తల్లి కావేరిబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుధాకర్ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని..
అమరావతి: డా.సుధాకర్ కేసులో తల్లి కావేరిబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుధాకర్ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, 24 గంటల్లో డాక్టర్ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సుధాకర్ తల్లి కావేరిబాయి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.