హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-10T01:56:49+05:30 IST
కొత్త హెచ్-1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ్టితో ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలో వీసాలు జారీ చేయనుంది యూఎస్సీఐఎస్.
వాషింగ్టన్: కొత్త హెచ్-1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ్టితో ప్రారంభమైన నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలో వీసాలు జారీ చేయనుంది యూఎస్సీఐఎస్. ఇలా వీసాకు ఎంపికైన వారిని యూఎస్సీఐఎస్ మార్చి 31లోపు సమాచారం చేరవేస్తుంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా..
1. మొదట ప్రతి దరఖాస్తుదారుడు యూఎస్సీఐఎస్ ఖాతా క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
2. ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు(రూ.729) చెల్లించాల్సి ఉంటుంది.
3. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు వర్కర్కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అవసరం అవుతుంది.
4. ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు.
ఇక ప్రతి యేటా యూఎస్ వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ఇలా ప్రతి ఏడాది అగ్రరాజ్యం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అయితే, ప్రతి ఏడాది యూఎస్ ఇచ్చే 85వేల కొత్త హెచ్-1బీ వీసాలలో సుమారు 70 శాతం వీసాలు(దాదాపు 60వేలు) భారతీయులకు జారీ అవుతున్నట్లు సమాచారం. భారత్ తర్వాత అత్యధికంగా హెచ్-1బీ వీసాలు పొందేది డ్రాగన్ కంట్రీ చైనానే. కాగా, విదేశీ నిపుణులు ఈ వీసా ద్వారా అగ్రరాజ్యంలో తాత్కాలికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది.