హెచ్‌.ముత్యాలంపాడు వంతెనకు మరమ్మతులు చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T06:25:15+05:30 IST

హెచ్‌.ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై దెబ్బతిన్న వంతెనకు తక్షణం మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) డిమాండ్‌ చేశారు.

హెచ్‌.ముత్యాలంపాడు వంతెనకు మరమ్మతులు చేయాలి
వంతెనపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్ననాయకులు

జనసేన డిమాండ్‌ 

జి.కొండూరు, ఆగస్టు 19: హెచ్‌.ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై దెబ్బతిన్న వంతెనకు తక్షణం మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) డిమాండ్‌ చేశారు. జనసేన నాయకులతో కలిసి శుక్రవారం  వంతెనపై దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెనపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలకు అనేక ఇబ్బందులు  పడుతున్నారన్నారు. ముఖ్యంగా మండల కేంద్రం జి.కొండూరుకు వచ్చేందుకు అటు పలు గ్రామాల ప్రజలు, ఇటు వాహనాల రాకపోకలు లేక విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాలకులు, అధికారులు  వంతెనకు మరమ్మతులు చేయించాలని, శాశ్వతంగా హైలెవల్‌ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని  కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వై.ఎల్‌ నరసింహారావు, ప్రవీణ్‌, నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:25:15+05:30 IST