జిమ్నాస్టిక్స్ సమాఖ్య గుర్తింపు పునరుద్ధరణ
ABN , First Publish Date - 2021-02-28T09:33:38+05:30 IST
పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎ్ఫఐ) గుర్తింపును క్రీడాశాఖ పునరుద్ధరించింది. 2019, నవంబరులో జరిగిన జీఎఫ్ఐ ఎన్నికల రికార్డులను పరిగణనలోకి తీసుకొని మళ్లీ గుర్తింపును కొనసాగించింది...
న్యూఢిల్లీ: పదేళ్ల తర్వాత భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య (జీఎ్ఫఐ) గుర్తింపును క్రీడాశాఖ పునరుద్ధరించింది. 2019, నవంబరులో జరిగిన జీఎఫ్ఐ ఎన్నికల రికార్డులను పరిగణనలోకి తీసుకొని మళ్లీ గుర్తింపును కొనసాగించింది. ఆ ఎన్నికల్లో సుధీర్ మిట్టల్ అధ్యక్షుడిగా గెలిచాడు. సమాఖ్యలో వర్గపోరు కారణంగా 2011లో జీఎ్ఫఐ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది.