జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో మొదలైన నామినేషన్లు
ABN , First Publish Date - 2021-04-17T05:34:07+05:30 IST
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో మొదలైన నామినేషన్లు
తొలిరోజు 14 దాఖలు
టీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు 3
వరంగల్ సిటీ, ఏప్రిల్ 16 : జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల సందడి ప్రారంభమైంది. తొలిరోజైన శుక్రవారం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రె్సతో పాటు ఇండిపెండెంట్లు నామినేషన్లు సమర్పించారు. వరంగల్ ఎల్బీ కళాశాల సెంటర్లో 7 నామినేషన్లు, హన్మకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 7, మొత్తంగా 14 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో శని, ఆదివారాల్లో నామినేషన్ల జోరు పెరగనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు ఫీజులు చెల్లించి నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. వీరంతా రెండు రోజుల్లో సమర్పించనున్నారు.