ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత సిటీలో ఉంటున్న ఆమె గురించి షాకింగ్ నిజాలు..!

ABN , First Publish Date - 2021-09-07T22:28:31+05:30 IST

ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయిన భార్య.. ఏడేళ్ల తరువాత.. భర్తకు భారీ షాక్..

ఇద్దరు పిల్లలతో సహా భార్య అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత సిటీలో ఉంటున్న ఆమె గురించి షాకింగ్ నిజాలు..!

ఇంటర్నెట్ డెస్క్:  ఆఫీసులో ఉన్న అతడికి ఓ రోజు ఇంటి ఓనర్‌ నుంచి ఫోన్ వచ్చింది.  ‘‘మీ ఆవిడ జాడ తెలియట్లేదు.. పిల్లలు కూడా ఇంట్లో లేరు’’ అంటూ ఇంటి ఓనర్ సమాచారం అందించాడు.  దీంతో.. కంగారు పడిపోయిన ఆ భర్త భార్య కోసం అనేక చోట్ల వెతికాడు. పోలీసులకూ ఫిర్యాదు చేశాడు. ఫలితం లేకపోవడంతో చివరికి ఆశలు వదులుకున్నాడు. ఏడేళ్ల క్రితం జరిగిందీ ఘటన. అయితే.. ఇన్నాళ్ల తరువాత పోలీసులు మళ్లీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఓ భారీ ట్వీస్టు వెలుగులోకి వచ్చింది. ఇంటి ఓనరే.. ఆ వివాహితను తీసుకెళ్లిపోయి మరో చోట కాపురం పెట్టినట్టు బయటపడింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 


గ్వాలియర్‌లోని హజిరా ప్రాంతానికి చెందిన జితేంద్ర సింగ్ కుష్వాహాకు సుధా జాదోన్ అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య పిల్లలతో కలిసి అతడు ఓ అద్దె ఇంట్లో నివసిస్తుండే వాడు. ఈ క్రమంలో అతడు ఉద్యోగం నిమత్తం జైపూర్‌కు వెళ్లిపోయాడు. భార్య మాత్రం గ్వాలియర్ లోనే ఉండిపోయింది. అయితే..2014లో ఓరోజున జితేంద్రకు ఇంటి ఓనర్ నుంచి ఫోన్ వచ్చింది. మీభార్య పిల్లలూ కనబడట్లేదంటూ ఇంటి ఓనర్ సునీల్ చెప్పుకొచ్చాడు. ఆ తరువాత.. భార్య కోసం పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో జితేంద్ర  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే..చాలా కాలం పాటు సుధ ఆచూకీ దొరకకపోవడంతో ఈ కేసుకు కాలదోషం పట్టింది. 


ఇవీ చదవండి.. 

కూర తియ్యగా ఉందేంటన్న భర్త.. పంచదార వేశానన్న భార్య.. ఇదేంటని నిలదీసిన ఆ భర్త పరిస్థితి ఏంటంటే..


సెల్ఫీ తీసుకుంటుండగా.. బలవంతంగా ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళపై దాడి చేయడంతో..


ఇటీవల గ్వాలియర్ పోలీసులు..తప్పిపోయిన వారి ఆచూకీ వెతికిపట్టుకునేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో చిక్కుముడిగా మిగిలిపోయిన పాతకేసులపైనా వారు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సుధా బంధువులు, జితేంద్ర కూడా ఇంటి ఓనర్ సునీల్ విషయంలో తమకున్న అనుమానాలను పోలీసుల దృష్టికి తెచ్చారు. దీంతో.. పోలీసలు అతడిపై  దృష్టిసారించారు. అతడి సెల్ లోకేషన్ ఆధారంగా అతడి కదలికలపై ఓ అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సునీల్ నెలలో 20 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో గడుపుతున్నట్టు బయటపడింది. ఓ ప్రత్యేక పోలీసు బృందం అతడిని వెంబడించగా.. సుధా ఆచూకీ కూడా దొరికింది. వారిద్దరూ బృందావన్ ప్రాంతంలోనే కాపురం పెట్టినట్టు పోలీసులు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 


అయితే..సుధా మాత్రం తాను ఇక జితేంద్ర వద్దకు తిరగొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సునీలే తన భర్త అని తేల్చి చెప్పింది. గ్వాలియర్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాక గుళ్లో పెళ్లిచేసుకున్నామని, అతడి భార్యగా తాను కొత్త జీవితం ప్రారంభించానని పేర్కొంది. గ్వాలియర్‌లో ఉన్నతకాలం జితేంద్ర తనను ఎప్పుడూ అవమానిస్తూ, అనుమానిస్తూ ఉండేవాడని చెప్పింది. అతడు ఉద్యోగం నిమిత్తం జైపూర్‌కు వెళ్లిన సమయంలో సునీల్‌కు దగ్గరయ్యాని, ఆ తరువాత పిల్లలను తీసుకుని అతడితో వెళ్లిపోయానని ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చింది. కాగా.. వారి బంధం మొదలైయ్యేనాటికే సునీల్‌కు నలుగురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

44 ఏళ్ల మహిళ అదృశ్యం.. 23 రోజుల తర్వాత పక్కింటి వంటింట్లో తవ్వితే దొరికిన మృతదేహం.. అసలేం జరిగిందంటే.. 


నడిరోడ్డుపై అర్ధనగ్నంగా మహిళ శవం.. సీసీటీవీ చెక్ చేస్తే షాకింగ్ సీన్ వెలుగులోకి..

Updated Date - 2021-09-07T22:28:31+05:30 IST