జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్తి సెగలు

ABN , First Publish Date - 2021-03-01T16:39:18+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. 36 వార్డు వైసీపీ అభ్యర్థి స్వర్ణలతకు బీఫామ్..

జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్తి సెగలు

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. 36వ వార్డు వైసీపీ అభ్యర్థి స్వర్ణలతకు బీఫామ్.. ఇచ్చి ఇప్పుడు అభ్యర్థిని మార్చడంపై ఎల్‌ఐసీ బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు నిరసనకు దిగారు. స్వర్ణలతకు దళితులు సంఘాలు మద్దతు పలికాయి. 36వ వార్డు సీటును కొప్పుల వెంకటరావు సతీమణి స్వర్ణలతకి కేటాయించాలని డిమాండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి తమకు అన్యాయం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి భర్త కొప్పుల వెంకటరావు మాట్లడుతూ మొదటి నుంచి తాము వైసీపీ పార్టీని నమ్మకొని ఉన్నామన్నారు. గతంలో తమకు ద్రోణంరాజు శ్రీనివాసరావు సీటు కేటాయించారని తెలిపారు. మూడవ తేదీలోపు తమకు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ సీటు కేటాయించకపోతే రెబల్ అబ్యర్ధిగా పోటీ చేస్తామని హెచ్చరించారు. డబ్బులకు ఆశపడి ఎమ్మెల్యే వాసుపల్లి తమకు అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-03-01T16:39:18+05:30 IST