జీవీఎంసీ కమిషనర్‌ ఆకస్మిక పర్యటన

ABN , First Publish Date - 2021-04-13T06:12:08+05:30 IST

జీవీఎంసీ కమిషనర్‌ సృజన సోమవారం 70వ వార్డులో ఆకస్మికంగా పర్యటించారు.

జీవీఎంసీ కమిషనర్‌ ఆకస్మిక పర్యటన
శానిటరీ సిబ్బందికి సూచనలిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన

ఆటోనగర్‌, ఏప్రిల్‌ 12: జీవీఎంసీ కమిషనర్‌ సృజన సోమవారం  70వ వార్డులో ఆకస్మికంగా పర్యటించారు. వార్డు పరిఽధిలోని టీవీఎన్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, ఎర్రగెడ్డ కాలనీల మీదుగా శ్రామికనగర్‌ వరకు పర్యటించారు. తడి, పొడి వ్యర్థాల సేకరణ, ఖాళీ స్థలాలలో పేరుకుపోతున్న చెత్త నిల్వలపై ఆరా తీశారు. వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని, డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి దోమల వృద్ధిని అరికట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రమాదకర వ్యర్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆమె వెంట జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తాతారావు, స్థానిక సచివాలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-04-13T06:12:08+05:30 IST