మాణిక్యాలరావు కుటుంబాన్ని పరామర్శించిన జీవీఎల్

ABN , First Publish Date - 2020-08-03T21:21:04+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల స్వర్గస్తులైన మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని..

మాణిక్యాలరావు కుటుంబాన్ని పరామర్శించిన జీవీఎల్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల స్వర్గస్తులైన మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు పరామర్శించారు. మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


పశ్చిమగోదావరి జిల్లా కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మాణిక్యాలరావు అకాల మరణం తమకు తీవ్ర దిగ్భ్రాంతి కలుగచేసిందన్నారు. ఎప్పుడు తనను కలిసినా ప్రజా సంక్షేమ పనుల కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మాత్రమే మాట్లాడేవారు తప్ప తన స్వలాభం కోసం ఏనాడు మాట్లాడలేదన్నారు. వారి అకాల మరణం తమకు, తమ పార్టీ కి తీరని లోటని జీవీఎల్ పేర్కొన్నారు.


Updated Date - 2020-08-03T21:21:04+05:30 IST