మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన జీవీఎల్
ABN , First Publish Date - 2020-09-24T00:45:07+05:30 IST
ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. మోదీ, యోగి ఆచరణ, నిబద్ధత తెలిసి కూడా కొడాలి
అమరావతి: ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆచరణ, నిబద్ధత తెలిసి కూడా కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని తప్పుబట్టారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలు బుద్ది చెబుతారని జీవీఎల్ హెచ్చరించారు.