ఇలాంటి అరాచకాలు చేయడం సిగ్గుచేటు: జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2022-01-03T17:55:34+05:30 IST

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు.

ఇలాంటి అరాచకాలు చేయడం సిగ్గుచేటు: జీవీ ఆంజనేయులు

గుంటూరు జిల్లా: పట్టపగలు, నిత్యం రద్దీగా ఉండే దుర్గి గ్రామంలో వైసీపీకి చెందిన జడ్పీటీసీ కుమారుడు సుత్తితో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు వైసీపీని గెలిపిస్తే.. అభివృద్ధిని వదిలేసి ఇలాంటి అరాచకాలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? అని ప్రశ్నించారు. ఇదే విధంగా ఆనాడు తాము చేస్తే ఒక్క వైఎస్ విగ్రహం కూడా ఉండేదికాదన్నారు. ఇలాంటి దుష్ట సంప్రదాయానికి తెరదించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి, నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జీవీ ఆంజనేయులు అన్నారు.

Updated Date - 2022-01-03T17:55:34+05:30 IST