జల్లయ్యను ఎమ్మెల్యే కిరాతకంగా చంపించారు: GV Anjaneyulu

ABN , First Publish Date - 2022-06-05T18:02:56+05:30 IST

బీసీ నేత జల్లయ్యను ఎమ్మెల్యే పిన్నెల్లి కిరాతకంగా చంపించారని జి.వి.ఆంజనేయులు ఆరోపించారు.

జల్లయ్యను ఎమ్మెల్యే కిరాతకంగా చంపించారు: GV Anjaneyulu

Palnadu District: బీసీ నేత జల్లయ్య (Jallaiah)ను ఎమ్మెల్యే పిన్నెల్లి (Pinnelli) కిరాతకంగా చంపించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు (GV Anjaneyulu) ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ యాదవులు అంటే పిన్నెల్లికి ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు. బీసీలు బ్రతకడం వైసీపీకి ఇష్టం లేదా..? అని అన్నారు. నలుగురు బీసీలకు పదవులు ఇచ్చి 40 మంది బీసీలను చంపడం సామాజిక న్యాయమా? అని నిలదీశారు. జగన్ రెడ్డి అమరావతిని స్మశానం చేస్తే పిన్నెల్లి పల్నాడును వల్లకాడు చేశారన్నారు. పల్నాడులో బీసీ, ఎస్సీ, ముస్లింలు బ్రతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు. హత్య రాజకీయాలకు పాల్పడే వైసీపీ నేతలు, వారికి వత్కాసు పలికే పోలీసులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జి.వి.ఆంజనేయులు అన్నారు.

Updated Date - 2022-06-05T18:02:56+05:30 IST