టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు..
ABN , First Publish Date - 2021-03-08T05:45:51+05:30 IST
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
జీవీ ఆంజనేయులు
సత్తెనపల్లి, మార్చి7: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తూ, పోలీసులను అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆదివారం ఎన్టీఆర్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడులో తప్పుడు కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు మైనింగ్పేరుతో కోట్లాదిరూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమన్నారు. ఆరునెలల్లో సత్తెనపల్లికి పార్టీ ఇన్చార్జ్ని ప్రకటిస్తామన్నారు. మూడో వార్డులో వైసీపీ అభ్యర్థితోపాటు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న వలంటీరు గోపినాయక్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ యెలినేటి రామస్వామి, తెలుగుయువత రాష్ట్ర నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర పరిశీలకులు ధారునాయక్, నేతలు భీమినేని వందనాదేవి, సయ్యద్ పెదకరిముల్లా, మస్తాన్వలి, పూజల వెంకటకోటయ్య, మారెళ్ల మల్లేశ్వరరావు, గుర్రం నరేంద్ర, పచ్చల నాగేశ్వరరావు, కొబ్బరి సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.