‘ద్యేవుడా... నన్ను బిచ్చగాడిని చేశావ్’.. అంటూ ఆలయంపై యువకుని దాడి!

ABN , First Publish Date - 2021-04-04T13:35:55+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.

‘ద్యేవుడా... నన్ను బిచ్చగాడిని చేశావ్’.. అంటూ ఆలయంపై యువకుని దాడి!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌లో తన ఉద్యోగం పోయిందని, ఆ తరువాత పని దొరకలేదని, దీనికి దేవుడే కారకుడని ఆరోపిస్తూ, ఒక యువకుడు ఆలయంపై దాడికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనపై పశ్చిమపురిలోని మాతా వైష్ణోదేవి ఆలయ పూజారి రామ్ పాఠక్ ఫిర్యాదు చేశారు. 


ఆలయ ప్రాంగణంలోని శివుని విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయని, పలుచోట్ల రాళ్లు, ఇటుకలు పడివున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ఘటనలో 28 ఏళ్ల వివేక్ హస్తముందని కనుగొన్నారు. అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివేక్... లాక్‌డౌన్ సమయంలో తన ఉద్యోగం పోయిందని, భగవంతుడే తనను బిచ్చగానిగా మార్చివేశాడని పోలీసులకు తెలిపాడు. దీనికి ప్రతీకారంగానే తాను ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశానని ఒప్పుకున్నాడు.

Updated Date - 2021-04-04T13:35:55+05:30 IST