బీజేపీ విధానాలతో కేసీఆర్ కాదు.. ప్రజలు భయపడుతున్నారు: గుత్తా

ABN , First Publish Date - 2022-01-04T16:06:06+05:30 IST

దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆరాచక పాలన సాగిస్తోందని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని...

బీజేపీ విధానాలతో కేసీఆర్ కాదు.. ప్రజలు భయపడుతున్నారు: గుత్తా

నల్గొండ జిల్లా: దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆరాచక పాలన సాగిస్తోందని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ప్రచారం చేస్తున్నారని, బీజేపీ విధానాలతో కేసీఆర్ కాదు ప్రజలు భయపడుతున్నారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా సీబీఐ, ఐటీ దాడులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇదే పద్దతిని తెలంగాణలో చేయాలని చూస్తున్నారని, ప్రజలు, నాయకులను జైల్లో పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ధ్వంద్వ విధానాలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, రైతులను ఇబ్బందులు పెట్టేలా బీజేపీ చేస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2022-01-04T16:06:06+05:30 IST