AP: గుంటూరులో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-07-30T16:06:09+05:30 IST

జిల్లాలోని వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం ఎస్టీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

AP: గుంటూరులో అగ్నిప్రమాదం

గుంటూరు: జిల్లాలోని వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం ఎస్టీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. వంట చేస్తుండగా పొయ్యి నుండి మంటలు చెలరేగి గుడిసెకు నిప్పు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

Updated Date - 2021-07-30T16:06:09+05:30 IST