రూ.17లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ABN , First Publish Date - 2021-03-07T05:16:14+05:30 IST
ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద డీసీఎం అక్రమంగా తరలిస్తున్న రూ.17లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను శనివారం పట్టుకున్నామని ఇందల్వా యి ఎస్సై శివప్రసాద్రెడ్డి తెలిపారు.
ఇందల్వాయి, మార్చి 6: ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద డీసీఎం అక్రమంగా తరలిస్తున్న రూ.17లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను శనివారం పట్టుకున్నామని ఇందల్వా యి ఎస్సై శివప్రసాద్రెడ్డి తెలిపారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ ను విచారించగా.. గుట్కా ప్యాకెట్లను కర్ణాటకలోని బీదర్ నుంచి నిర్మల్ తీసుకెళ్తున్నట్టు తెలిపాడని ఎస్సై తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద నిఘావేసి రూ.17లక్షల విలువ గల అంబర్ ప్యాకెట్లను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివప్రసాద్రెడ్డి తెలిపారు.