ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: గురునాధరావు

ABN , First Publish Date - 2021-12-17T23:56:19+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా తొమ్మిది మంది అక్కడికక్కడే

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: గురునాధరావు

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా తొమ్మిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరొకరు మరణించారు. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గురునాధరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని గురునాధరావు కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు గురునాధరావు ఆర్థిక సాయం అందించారు. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ ప్రాంతంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సరిగా పనిచేయని బస్సులను జగ్గారెడ్డిగూడెం డిపోకు పంపిస్తారని దుయ్యబట్టారు. సామర్ధ్యం లేని బస్సులను తిప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని గురునాధరావు హితవుపలికారు. 

Updated Date - 2021-12-17T23:56:19+05:30 IST